Sunday, May 5, 2024

చెల్లినే వ్యభిచారంలోకి నెట్టిన సిస్టర్.. ఇంటర్నేషనల్​ హ్యూమన్​ ట్రాఫికింగ్​ ముఠా అరెస్టు!​

అమ్మాయిలను వ్యభిచారం రొంపిలోకి లాగుతూ.. విదేశాలకు సప్లయ్​ చేస్తున్న ఓ ముఠాని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. బంగ్లాదేశ్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. అంతేకాకుండా ఈ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌లో ప్రమేయం ఉన్న ఆరుగురిని రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. హైదరాబాద్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఈ రాకెట్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు బాలికలు, ఓ మైనర్‌, ఆమె సోదరిని పోలీసులు ఈ ముఠా బారి నుంచి కాపాడారు.

బాధితురాలిలో ఒకరు తన 15 ఏళ్ల సోదరిని వ్యభిచారంలోకి దింపింది. అయితే.. నిర్వాహకులు తన చెల్లిని బలవంతంగా మహారాష్ట్రకు తీసుకెళ్లారని పేర్కొంటూ ఉప్పల్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బాధితురాలిని మోసగించి నకిలీ గుర్తింపు పత్రాలతో నగరానికి తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపినట్లు తెలుస్తోంది.

ఈ నెల 7న రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వ్యభిచార రాకెట్‌ నడుపుతున్న ఓ మహిళను జవహర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. సిరిగాడి అరుణ అనే నిందితురాలు 2019 నుంచి మానవ అక్రమ రవాణా, వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు జవహర్‌నగర్‌లో అద్దెకు తీసుకుని, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళలను తీసుకువచ్చి బ్రోతల్​ హౌస్​ నడుపుతున్నారు.

కస్టమర్లకు తమ లొకేషన్‌ షేర్​ చేసి అమ్మాయిల విషయాలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా విటులు ఉన్న ప్రాంతాలకే వాట్సాప్​ ద్వారా సమాచారం చేరవేసి వారి లొకేషన్​ ఆధారంగా అమ్మాయిలను పంపిస్తున్నారు. ఇట్లా బలవంతంగా ఓ యువతిని వ్యభిచారంలోకి నెట్టారు. కాగా, నిందితుడు కస్టమర్ల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement