Monday, May 6, 2024

భారత్‌ బయోటెక్‌ను సందర్శించిన ఆసియా దేశాల జర్నలిస్టులు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: శామీర్‌పేట్‌లోని భారత్‌ బయోటెక్‌, టాటా కన్సల్టెన్సీలను ఆసియాన్‌ దేశాల జర్నలిస్టుల బృందం సందర్శించింది. ఫార్మా రంగంలో భారత్‌ బయోటెక్‌ చేస్తున్న కృషిని, కోవిడ్‌ వ్యాక్సిన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు. దీనికి ముందు ఆసియాన్‌-ఇండియా మీడియా ఎక్స్‌చేంజిలో భాగంగా 10 ఆసియా దేశాల నుంచి వచ్చిన 20 మంది జర్నలిస్టులు హైదరాబాద్‌ ఆదిబట్లలోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌ను సందర్శించారు.

టాటా కంపెనీ విశిష్టత, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టీసీఎస్‌ అందిస్తున్న ఐటీ సేవలు, ఆసియాన్‌ దేశాలలో చేస్తున్న కార్యకలాపాల గురించి టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్న వివరించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement