Monday, May 6, 2024

జేఎన్టీయూ స్నాతకోత్సవం.. విద్యకు మొదటి ప్రాధాన్యత

ప్రతి విద్యార్థి సాంకేతికతను ఉపయోగించుకొని ముందుకెళ్లాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచించారు. శనివారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. వర్చువల్ విధానంలో రాష్ట్ర గవర్నర్  గౌ.బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రసంగించారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. జేఎన్టీయూ స్నాతకోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సీఎం జగన్ విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ జగన్ అన్న విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులకు తోడ్పాటును ఇచ్చారన్నారు. విద్యపై ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement