Sunday, April 28, 2024

Railway | రైల్వే బోర్డు సీఈవోగా జ‌య‌వ‌ర్మ సిన్హా నియామకం.. తొలి మ‌హిళా చైర్​పర్సన్​గా రికార్డు

రైల్వే బోర్డు సీఈవో, చైర్‌ప‌ర్స‌న్‌గా జ‌య‌వ‌ర్మ సిన్హా నియామ‌కం అయ్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వాల (గురువారం) ఉత్త‌ర్వులు జారీ చేసింది. రైల్వే బోర్డు సీఈవోగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న తొలి మ‌హిళా అధికారి జ‌య‌వ‌ర్మ‌నే కావ‌డం విశేషం. ఇండియ‌న్ రైల్వే మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్ అధికారిణి అయిన జ‌య‌వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం రైల్వే బోర్డు స‌భ్యురాలిగా (ఆప‌రేష‌న్స్ అండ్ బిజినెస్ డెవ‌ల‌ప్‌మెంట్‌) ఉన్నారు.

సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి 2024 ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు లేదా త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు జ‌య‌వ‌ర్మ సిన్హా రైల్వే బోర్డు సీఈవోగా కొన‌సాగ‌నున్నారు. ఇవాల్టి వ‌ర‌కు రైల్వే బోర్డు సీఈవోగా అనిల్ కుమార్ ల‌హాటీ కొన‌సాగారు. 1988లో ఇండియ‌న్ రైల్వే ట్రాఫిక్ స‌ర్వీస్‌లో సిన్హా చేశారు. నార్త‌ర్న్ రైల్వే, సౌత్ ఈస్ట్ రైల్వే, ఈస్ట‌ర్న్ రైల్వేలో ఆమె ప‌ని చేశారు. ఆమె అల‌హాబాద్ యూనివ‌ర్సిటీ పూర్వ విద్యార్థి.

Advertisement

తాజా వార్తలు

Advertisement