Thursday, May 9, 2024

AP: గుండెపోటుతో క్రికెట్ అభిమాని మృతి

విశాఖ: అంతర్జాతీయ స్టార్ క్రికెటర్ల అభిమాని, విశాఖ వాసి ఈశ్వర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కు “సైడ్ ఆర్మ్ త్రో” బౌలర్ గా ఈశ్వర్ సేవలు అందిస్తున్నారు. భారత వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఈశ్వర్ ఇంటికి వెళ్లి మృతదేహానికి నివాళులర్పించారు.

భారత మాజీ ఆటగాడు వేణుగోపాలరావు ప్రోత్సాహంతో ఈశ్వర్ స్టార్ క్రికెటర్లకు దగ్గరయ్యాడు. ఈశ్వర్ మృతి పట్ల స్టార్ క్రికెటర్లు రికి పాంటింగ్, డేవిడ్ వార్నర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, క్రికెటర్లు సంతాపం తెలియజేశారు. ఈశ్వర్ విశాఖలోని గాజువాక ప్రాంత వాసి.

Advertisement

తాజా వార్తలు

Advertisement