Tuesday, April 30, 2024

భూపాలపల్లి జిల్లాలో కొత్త మండలం.. ప్రిలిమనరీ డ్రాఫ్ట్‌ విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో నూతన రెవెన్యూ మండలం ఏర్పాటుకు ప్రిలిమనరీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ జిల్లాలోని కొత్తపల్లిగోరి పేరుతో నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం శనివారం ప్రాథమిక ముసాయిదాను వెల్లడించింది. తద్వారా ప్రజల నుంచి 15 రోజులపాటు విజ్ఞప్తులు, సలహాలు, అభ్యంతరాలు, సూచనలను కోరుతున్నట్లు వెల్లడించింది.

భూపాలపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని రేగొండ మండలానికి చెందిన కొత్తపల్లిగోరి, దమ్మన్నపేట , చెన్నాపూర్‌, చిన్నకొడెపాక, జగ్గయ్యపేట, సుల్తానాపూర్‌, జంషెడ్‌బాగ్‌పేట్‌, కోనారావుపేట గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement