Sunday, May 19, 2024

దాడులు చేసే సంస్కృతిని జ‌న‌సేన ఎప్పుడూ ప్రోత్స‌హించ‌లేదు : నాదేండ్ల మ‌నోహ‌ర్‌

దాడులు చేసే సంస్కృతిని జ‌న‌సేన ఎప్పుడూ ప్రోత్స‌హించ‌లేద‌ని, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ పర్యటన నుంచి దృష్టిమళ్లించేందుకే వైసీపీ నాటకాలు ఆడుతోందని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఎయిర్ పోర్టులో జనసైనికులు దాడి చేశారని మంత్రులు చెప్పడం విడ్డూరంగా ఉంద‌ని, మంత్రుల కార్లపై దాడి జరిగినట్లుగానీ, జనసైనికులు దాడి చేసినట్లుగానీ పోలీసులు నిర్ధారించలేదన్నారు. కేవలం వైసీపీ నేతలే ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడి సంస్కృతిని జనసేన ఎప్పుడూ ప్రోత్సహించదన్నారు. దాడి విద్యలో వైసీపీ నేతలే ఆరితేరిపోయారని నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement