Wednesday, May 1, 2024

కూడబెట్టిన డబ్బులతో జగన్ ప్రధాని కావాలనుకుంటున్నారు: RRR

ఏపీ సీఎం జగన్‌పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు దేశ ప్రధాని కావాలనే ఆశ ఉందని ఆయన అన్నారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే పట్టించుకోకుండా… కూడబెట్టిన డబ్బులతో ప్రధాని కావాలనుకుంటున్నారని… ఆయన కోరికను పైనున్న దేవుళ్లు, ఆయన నమ్మిన ఏసుక్రీస్తు కూడా అంగీకరించరని వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలోని ఆసుపత్రుల్లో కోవిడ్ బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందని… ఈ అరాచకాలను పట్టించుకునే వారే లేరని రఘురాజు మండిపడ్డారు.

సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే 46 మంది పేషెంట్లు చనిపోయారని ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఇస్తున్నామంటూ జగన్ చేసిన ప్రకటనపై కూడా ఆయన మండిపడ్డారు. జగన్ ఏమైనా ఆయన జేబులో నుంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని… ఈ కేసులను జగన్‌పై పెట్టాలన్నారు. కరోనా లెక్కలపై ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెపుతోందని దుయ్యబట్టారు. కేసులు విపరీతంగా పెరిగిపోతుంటే లాక్ డౌన్ పెట్టకుండా… కర్ఫ్యూ పెట్టడమేంటని ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement