Sunday, May 5, 2024

వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించినట్లు జగన్ చెప్పడం విడ్డూరం : తులసిరెడ్డి

వ్య‌వ‌సాయ రంగంలో అధ్బుతాలు సృష్టించిన‌ట్లు సీఎం జ‌గ‌న్ చెప్పుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. మోదీ సర్కార్ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్ ను ప్రవేశపెట్టడం చారిత్రక తప్పిదమన్నారు. ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేయాలని హితవుపలికారు. నీతి అయోగ్ సమావేశంలో ప్రత్యేక హోదా, పోలవరం, విభజన అంశాల అమలు గురించి ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించినట్లు జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement