Thursday, April 25, 2024

మునుగోడులో మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే.. భట్టి విక్రమార్క

మునుగోడులో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే గెలుస్తాడని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈరోజు హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ… ఈ నెల 16వ తేదీ నుండి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టుగా చెప్పారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలతో చోటు చేసుకొన్న పరిస్థితులను తెలుసుకొనేందుకు గాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయం తీసుకొన్నామని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

ఈ నెల 16 నుండి భద్రాచలం నుండి వరద ప్రభావిత ప్రాంతాల నుండి పర్యటనను ప్రారంభించనున్నట్టుగా మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆయా జల్లాల్లోని ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామని కూడా భట్టి విక్రమార్క తెలిపారు. చాలా ప్రాజెక్టులు మరమ్మత్తులకు కూడా నోచుకోలేదని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం, కడెం ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులను కూడా పరిశీలిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ తీరును కూడా సీఎల్పీ బృందం పరిశీలించనుందన్నారు. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తామని కూడా ఆయన వివరించారు. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లుభట్టి విక్రమార్కతో పాటు జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, సీతక్క, పోడెం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement