Tuesday, May 14, 2024

భర్తతో స్నేహంగా ఉంటుంద‌ని కిరాయి యువకులతో కిరాతకం.. వీడియో తీసి మ‌రీ బెదరింపులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆనందంగా సాగిపోతున్న భార్యాభర్తల జీవితంలో.. అనుమానమనే భూకంపం వచ్చినప్పుడు.. ఒక్కోసారి తీరని నష్టం వాటిల్లొచ్చు. కొన్నిసార్లు చిన్నచిన్న ప్రకంపనలతోనే ముగిసిపోవచ్చు. అయితే చిన్నగా మొదలైన అనుమానం మరికొన్ని సందర్భాల్లో మాత్రం మనిషిని రాక్షసుడిగా మార్చుతుంది. ఆ సమయంలో తాను పడే క్షోభ క్రూరంగా మారి ఘోరాలు చేయిస్తుందనటానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. గచ్చిబౌలిలోని కొండాపూర్‌ శ్రీరామ్‌నగర్‌లో గాయత్రి, శ్రీకాంత్‌ దంపతులు నివసిస్తున్నారు. అదే కాలనీలో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన 25 ఏళ్ల యువతి కూడా నివాసముంటూ.. సివిల్స్‌కి ప్రిపేర్‌ అవుతోంది. ఒకే కాలనీలో ఉండటం శ్రీకాంత్‌ కూడా సివిల్స్‌కు ప్రిపేర్‌ అవుతుండటం వల్ల సాధారణంగానే సదరు యువతికి శ్రీకాంత్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నే#హంగా మారింది. గాయత్రి తన ఆరోగ్యం బాగోలేదని సదరు యువతిని ఇంటికి పిలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బాధితురాలిని గాయత్రి తన ఇంట్లోనే ఉంచుకుంది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది.

అనుమానం వ‌చ్చిందిలా

భర్త శ్రీకాంత్‌, తనవ ఇంట్లోనే ఉంటున్న యువతి ప్రవర్తనపై గాయత్రి మనసులో అనుమానం మొలకెత్తింది. తన భర్త ఇంకో అమ్మాయితో చనువుగా ఉండటం చూసి గాయత్రి తట్టుకోలేకపోయింది. తనకే సొంతమనుకున్న భర్త మరో యువతికి ఆకర్షితుడవుతున్నాడన్న ఆలోచన తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. రోజురోజుకు పెరిగిపోతున్న అనుమానం మనసును క్షోభకు గురిచేసింది. ఈ సమస్యకు ఎలాగైన పరిష్కారం చెప్పాలనుకుంది. ప్రేమతో చెప్పి చూసినా.. బాధ్యతగా మందలించినా.. భయంతో బెదిరించినా.. భర్త ప్రేమ దూరమవుతుందనుకుందో ఏమో.. ఆ అమ్మాయి వైపు నుంచి నరుక్కురావాలని నిశ్చయించుకుంది. ఈ వ్యవహారంపై ఏప్రిల్‌ 24న గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. అక్కడితో ఆగకుండా.. క్రూరంగా ఆలోచించి ఓ ఘోరమైన పథకాన్ని పన్నింది. ఇటీవల తాను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకుంది. తర్వాత విత్‌డ్రా చేసుకున్న కేసు గురించి మాట్లాడాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంటికి పిలిచింది. గాయత్రి మనసులో ఉన్న ప్లాన్‌ తెలియక.. యువతితో సహా కుటుంబసభ్యులు ఇంటికి వెళ్లారు. ఇంటికి వచ్చిన వారితో మాట్లాడిన తర్వాత కాసేపటికి యువతిని గాయత్రి తన రూంలోకి తీసుకెళ్లింది. ముందుగా వేసిన పథకం ప్రకారం.. అప్పటికే ఇంట్లో ఉన్న నలుగురు యువకులతో యువతిపై దాడి చేయించింది. నోట్లో గుడ్డలు కుక్కి యువతి ప్రైవేట్‌ భాగాలపై తీవ్ర గాయాలు చేసి తీవ్రంగా హింసించిన యువకులు బాధితురాలిపై లైంగికదాడికి పాల్పడ్డారు.

ప్రైవేట్‌ భాగాల్లో పదునైన ఆయుధాలతో గాయపరిచారు. అక్కడితో ఆగకుండా.. ఈ ఘాతుకం మొత్తాన్ని గాయత్రి తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియో మొత్తాన్ని సోషల్‌ మీడియాలో పెడతానని బాధితురాలిని గాయత్రి బెదిరించింది. తీవ్రంగా గాయపడిన యువతిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చికిత్స పొందుతూనే బాధితురాలు జరిగిందంతా పోలీసులకు వివరించగా పోలీసులు కేసు నమోదు చేశారు. గాయత్రితో పాటు నలుగురు యువకులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement