ఐపిఎల్ 17వ సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలోని తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మరి కొద్ది సేపట్లో చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ ప్రారంభంకానుంది.
కాగా, యువ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో చెన్నై తొలిసారి బరిలోకి దిగనుంది. అదేవిదంగా డుప్లెసిస్ కెప్టెన్సీలో బెంగళూరు జట్టు సమరానికి సిద్దమైంది. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టి అతనిపైనే నిలిచింది. ఈ మ్యాచ్తో తన కెరీర్లో మరో మైలురాయికి చేరువయ్యాడు. ఇంకో సిక్సర్ కొడితే టీ20 క్రికెట్లో 12 వేల పరుగుల క్లబ్లో చేరుతాడు కోహ్లీ. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్గా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.
జట్ల వివరాలు (అంచనా)..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫాఫ్ డు ప్లెసిస్ (C), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్ (WK), మనోజ్ S భాండగే/మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్/విజయ్కుమార్ వైషాక్, రీస్ టోప్లే /అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్
చెన్నై సూపర్ కింగ్స్ :
రుతురాజ్ గైక్వాడ్ (C), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే/మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (WK), దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, ముఖేష్ చౌదరి