Monday, April 29, 2024

Boxing Championship | ఎలోర్డా కప్ భారత్‌కు ఐదు పతకాలు

కజకిస్తాన్‌లో జరుగుతున్న ఎలోర్డా కప్‌ 2023 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బృందం ఐదు పతకాలతో మెరిసింది. విజయ్‌ కుమార్‌, సుష్మా, సంజిత్‌సింగ్‌, నీమా, సుమిత్‌ కాంస్య పతకాలు సాధించారు. సెమీఫైనల్‌ బౌట్‌లో 60 కేజీల విభాగంలో విజయ్‌ కుమార్‌ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, స్థానిక బాక్సర్‌ బెంకూర్‌ ఒఝనోవ్‌ చేతిలో 1-4తో ఓటమిపాలయ్యాడు.

మహిళల 81 కేజీల విభాగంలో 2023 ప్రపంచక చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత ఫరీజా షోల్టే చేతిలో సుష్మా 0-5 తేడాతో ఓడింది. అలాగే 48 కేజీల విభాగంలో సంజిత్‌సింగ్‌, 63 కేజీల విభాగంలో నీమా, 86 కేజీల విభాగంలో సుమిత్‌ సెమీఫైనల్స్‌లోనే ఇంటిదారి పట్టారు. కాంస్యపతక విజేతకు 200 అమెరికన్‌ డాలర్లు ప్రైజ్‌మనీగా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement