Sunday, April 28, 2024

London : లండ‌న్‌లో రోడ్డు ప్ర‌మాదంలో భార‌త విద్యార్థిని మృతి

లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత విద్యార్థిని మృతి చెందింది. భారత పరిశోధక విద్యార్థిని చెయిస్తా కొచ్చర్‌ (33) లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో పిహెచ్‌డి చేస్తున్నారు. కళాశాల నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ సెంట్రల్‌ లండన్‌లోని తన ఇంటికి వెళుతుండగా, వేగంగా వచ్చిన ట్రక్కు సైకిల్‌ ను ఢీకొట్టింది.

- Advertisement -

ఆ సమయంలో ఆమె భర్త ప్రశాంత్‌ కొంత దూరంలోనే ఉన్నారు. వెంటనే వచ్చి ఆమెను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. తీవ్రగాయాలపాలైన కొచ్చర్‌ అప్పటికే మఅతి చెందారు. ఈ విషయాన్ని తాజాగా కొచ్చర్‌ తండ్రి రిటైర్డ్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ ఎస్పీ కొచ్చర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు.

‘ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం చెయిస్తా స్నేహితుల్లో, కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. ఇది చాలా బాధాకరం. నేనింకా లండన్‌లోనే ఉన్నా చెయిస్తా అవశేషాలను సేకరించడానికి ప్రయత్నిస్తున్నా ‘ అని లింక్‌డిన్‌లో కొచ్చర్‌ తండ్రి పోస్టు చేశారు. ఆమె తండ్రి లెఫ్టినెంట్‌ జనరల్‌ ఎస్‌పీ కొచ్చర్‌ (రిటైర్డ్‌) మఅతదేహాన్ని తీసుకురావడానికి లండన్‌కు చేరుకున్నారు.

గురుగ్రామ్‌లో నివాసముండే చెయిస్తా.. సెప్టెంబరులోనే పీహెచ్‌డీ కోసం లండన్‌కి వెళ్లారు. గతంలో ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం, అశోక యూనివర్సిటీ, పెన్సిల్వేనియా, షికాగో విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించారు. 2021-23 మధ్య నీతి ఆయోగ్‌లోని నేషనల్‌ బహేవియరల్‌ ఇన్‌సైట్స్‌ యూనిట్‌లో సీనియర్‌ సలహాదారుగా సేవలందించారు. చెయిస్తా మరణ వార్తపై నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ స్పందించారు. ఆమె మఅతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ” చెయిస్తా ఎంతో దైర్య వంతురాలు. ఆమె నీతి ఆయోగ్‌ యూనిట్‌లో నాతో కలిసి పని చేశారు. ఇంత త్వరగా మన నుంచి దూరం కావడం బాధాకరం ” అని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement