Sunday, April 28, 2024

TS : హోలీ వేడుకల్లో విషాధం…. మంచినీటి ట్యాంకు కూలి చిన్నారి మృతి…

నారాయణపేటలో హోలీ వేడుక‌ల్లో విషాధం నెల‌కొంది. పట్టణంలోని గోపాల్‌పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా అకస్మాత్తుగా అది కూలిపోయింది. దీంతో ట్యాంకు సిమెంట్ ముక్కలు వారిపై పడటంతో తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

స్థానికులు వెంటనే వచ్చి చిన్నారులను జిల్లా దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ లక్ష్మీ ప్రణీత (12) అనే చిన్నారి మృతి చెందింది. ప్రణీత అనే చిన్నారికి చెయ్యి వీరుగగా హరిప్రియకు కాలు విరిగింది. కాగా, స్థానికులు ప్రమాదానికి కారణమైన ట్యాంకును పూర్తిగా తొలగించారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement