Tuesday, May 7, 2024

ఇండియా VS ఆస్ట్రేలియా మ్యాచ్.. రేపు అర్ధరాత్రి 1గంట వరకు మెట్రో సేవలు

హైదరాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఆదివారం ఇండియా VS ఆస్ట్రేలియా జ‌ట్ల టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ దృష్ట్యా హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు రాత్రి మెట్రో రైళ్ల సేవ‌ల‌ను పొడిగించారు. క్రికెట్ వీక్షించేందుకు వ‌చ్చే జ‌నాల‌ను దృష్టిలో ఉంచుకొని ఆదివారం రాత్రి 11 గంట‌ల నుంచి అర్ధ‌రాత్రి ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండ‌నున్నాయి. రాత్రి 11 నుంచి ఒంటి గంట వ‌ర‌కు కేవ‌లం ఉప్ప‌ల్ స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేష‌న్లలోనే ప్ర‌యాణికుల‌ను ఎక్కేందుకు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. మిగ‌తా స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల‌కు అనుమ‌తి ఇవ్వ‌రు. ఇక ఏ స్టేష‌న్‌లోనైనా దిగేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మ్యాచ్‌కి వెళ్లే ముందు స్టేడియం మెట్రో స్టేషన్ నుంచి నిష్క్రమించేటప్పుడు ముందుగానే రిటర్న్ టిక్కెట్‌ లను కొనుగోలు చేయమని కస్టమర్ల‌కు మెట్రో అధికారులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement