Friday, April 26, 2024

లంకతో నేడు రెండో వన్డే.. గెలిస్తే టీమిండియా కొత్త రికార్డు..

శ్రీలంక టూర్ లో ఉన్న టీమిండియా యువజట్టు ఒకరోజు విరామం తర్వాత మరో పోరుకు సిద్ధమైంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకోవాలని ధావన్‌ సేన పట్టుదలగా ఉంది. పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్ భారత్‌ బలం. కెప్టెన్‌ శిఖర్‌ధావన్‌తో పాటు యువ ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీష్‌ పాండే… అంతా హార్డ్‌ హిట్టర్లే. వీళ్లకు కళ్లెం వేయడం అంటే… ప్రస్తుత లంక జట్టుకు శక్తికి మించిన పనే. బౌలింగ్‌లోనూ మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య తొలివన్డేలో ఆకట్టుకునేలా బౌలింగ్‌ వేశారు. వీళ్లకి తోడు హార్దిక్‌ పాండ్యా, సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఎలాగూ ఉన్నారు. అంతా కలిసి లంక పని పడితే… రెండో వన్డేలోనూ గెలుపు ఖాయమన్న ధీమాతో ఫ్యాన్స్‌ ఉన్నారు.

రెండో వన్డేలో టీమిండియా గెలిస్తే సరికొత్త రికార్డు క్రియోట్ చేయనుంది. తొలి వన్డేలో విజయ సాధించడం ద్వారా శ్రీలంకపై వన్డేల్లో 92వ విజయం సాధించిన జట్టుగా నిలిచింది. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సరసన ఇప్పుడు భారత్‌ కూడా చేరింది. న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా, శ్రీలంకపై పాకిస్థాన్ అన్నేసార్లు విజయం సాధించాయి. ఇవాళ శ్రీలంకతో జరగనున్న రెండో వన్డేలోనూ గబ్బర్‌ సేన విజయం సాధిస్తే… ఒకే జట్టుపై అత్యధిక మ్యాచుల్లో విజయం సాధించిన ప్రపంచ రికార్డు… భారత్ సొంతమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఇది కూడా చదవండి : పెగాసస్‌పై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

Advertisement

తాజా వార్తలు

Advertisement