Thursday, March 28, 2024

ఒకే వ్యక్తిలో ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు

దేశంలోని తొలిసారిగా ఓ వ్యక్తికి ఒకేసారి రెండు కరోనా వేరియంట్లు సోకిన ఘటన అసోంలో వెలుగు చూసింది. దిబ్రూగఢ్‌లోని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (ఆర్ఎంఆర్‌సీ)లో పరీక్ష చేయించుకున్న ఓ వైద్యురాలికి రెండు వేరియంట్లు ఒకేసారి సోకినట్టు గుర్తించారు.

వైద్యురాలు వ్యాక్సిన్ రెండు డోసులూ వేసుకున్నప్పటికీ.. ఆల్ఫా, డెల్టా రకాల కరోనా సోకిందని ఆర్ఎంఆర్‌సీ పేర్కొంది. అయితే స్వల్ప లక్షణాలతో ఇబ్బందిపడిన ఆమె.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకున్నారని తెలిపింది. రెండు వేరియంట్లు ఒకేసారి సోకిన ఘటనలను ‘డబుల్ ఇన్ ఫెక్షన్’ అంటారని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ బి.జె. బోర్కకోటీ చెప్పారు. ఓ వ్యక్తికి ఏదైనా వేరియంట్ సోకిన రెండు మూడు రోజుల్లో కానీ, లేదా ప్రతిరక్షకాలు ఉత్పత్తి కావడానికి ముందుగా కానీ ఇలా మరో వేరియంట్ కూడా సోకే అవకాశం ఉంటుందన్నారు. మే తొలి వారంలోనే ఈ కేసు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. వైద్యురాలి భర్తకు ఆల్ఫా వేరియంట్ సోకినట్టు తేల్చారు. ఇలాంటి డబుల్ ఇన్ ఫెక్షన్ కేసులు చాలా అరుదుగా నమోదవుతాయని వైద్యులు పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: త్వరలోనే భారత్‌లోకి మోడెర్నా వ్యాక్సిన్

Advertisement

తాజా వార్తలు

Advertisement