Thursday, April 25, 2024

విశాఖకు చెరుకున్న భార‌త్, సౌత్ ఆఫ్రికా జ‌ట్లు.. రేపు ఉత్కంఠ‌గా సాగ‌నున్న‌ టీ20 మ్యాచ్‌..

రెపు జ‌ర‌గ‌నున్న టీ20 మ్యాచ్ కొసం భార‌త్, సౌత్ ఆఫ్రికా జ‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ సిటీకి చెరుకున్నాయి. మొదట రెపు ఉద‌యం ప్రాక్టిస్ సెష‌న్ ఉంటుంద‌ని క్రికెట్ వ‌ర్గాలు తెలిపాయి. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్ప‌టికే ఇండియా రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. కాగా, రేపు జరిగె మ్యాచ్ లో భార‌త్ ఎలాగైనా గెల‌వాల‌న్న ఉద్దేశంతో బ‌రిలోకి దిగ‌నుంది.

దీనికోసం ముంద‌స్తుగా మ‌రింత క‌స‌ర్తు చేసే చాన్సెస్ ఉన్న‌ట్టు క్రికెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచిన సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్ కుడా గెలిచి సిరీస్ సాధించాల‌న్న‌ ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు తెలుస్తోంది. రేపు జ‌రిగే మ్యాచ్ ఇరు జ‌ట్ల‌కు ఎంతో కీల‌కం కానుంది. మ‌రి ఈ ర‌స‌వ‌త్త‌మైన పోరులో ఏ జ‌ట్టు విజ‌యం సాదిస్తుందో చూడాలి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement