Sunday, April 28, 2024

దేశంలో కొత్తగా 34,457 మందికి వైరస్

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 34,457 మంది వైరస్ బాడగా.. 375 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే 36,347 మంది కరోనా​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,61,340 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 151 రోజుల క‌నిష్ఠ‌ స్థాయికి చేరుకుంది.

దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,23,93,286కు చేరింది. ఇప్పటి వరకు 4,33,964 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో మొత్తం 3,15,97,982 మంది కోలుకున్నారు. దేశంలో నిన్న 36,36,043 వ్యాక్సిన్ డోసులు వేయగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 57,61,17,350 డోసుల వ్యాక్సిన్లు వేశారు. దేశంలో శుక్రవారం 17,21,205 కరోనా పరీక్షలు నిర్వహించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 50,44,20,907కు చేరింది. 

ఇది కూడా చదవండిః ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

Advertisement

తాజా వార్తలు

Advertisement