Sunday, April 28, 2024

ఏపీలో 20 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 69,173 శాంపుల్స్ ని పరీక్షించగా 1,435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,695 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 20,00038కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 19,70,864 మంది కోలుకున్నారు. మొత్తం మరణాల సంఖ్య 13,702కి చేరింది.

జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 31, చిత్తూరు జిల్లాలో 199, తూర్పుగోదావరి జిల్లాలో 178, గుంటూరు జిల్లాలో 133, కడప జిల్లాలో 53, కృష్ణాజిల్లాలో 175, కర్నూలు జిల్లాలో 19, నెల్లూరు జిల్లాలో 190, ప్రకాశం జిల్లాలో 109, శ్రీకాకుళం జిల్లాలో 50, విశాఖపట్నం జిల్లాలో 97, విజయనగరం జిల్లాలో 47, పశ్చిమగోదావరి జిల్లాలో 154 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

ఇది కూడా చదవండిః గౌరవం లేని చోట ఉండి ఏం లాభం: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement