Sunday, May 5, 2024

దేశంలో మళ్లీ క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో కొత్త క‌రోనా కేసులు మళ్లీ క్ర‌మంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 46,759 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. అలాగే శుక్రవారం నాడు 31,374 మంది కోలుకున్నార‌ని పేర్కొంది. దేశంలో క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది. క‌రోనా నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 3,18,52,802 మంది కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. నిన్న 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. దీంతో మొత్తం వినియోగించిన డోసుల సంఖ్య 62,29,89,134 కు చేరింది.

ఈ వార్త కూడా చదవండి: పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

Advertisement

తాజా వార్తలు

Advertisement