Monday, April 29, 2024

దసరా బరిలో… మెగా హీరోతో అక్కినేని హీరో ఢీ

అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేస్తున్న విసయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ రిలీజ్ డేట్‌తో కూడిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానరుపై బన్నీవాసు ఈ మూవీని నిర్మించాడు.

ఈ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. ఈషా రెబ్బా మరో కథానాయికగా అలరించనుంది. ఆమని, మురళీశర్మ, వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. గోపీ సుందర్ నుంచి వచ్చిన పాటలకి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. అయితే ఇదే రోజున మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ నటించిన ‘కొండపొలం’ మూవీ కూడా విడుదలవుతోంది. రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించాడు.

ఈ వార్త కూడా చదవండి: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్లకు కరోనా… షాక్‌లో నిర్వాహకులు

Advertisement

తాజా వార్తలు

Advertisement