Monday, May 6, 2024

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయం

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి సంచలనం నమోదు చేసింది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ పటేల్ ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ విభాగంలో ఫైనల్ చేరిన తొలి ఇండియన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. గురువారం నాడు బ్రెజిల్‌కు చెందిన ఓయ్స్ డి ఒలివీరాతో జరిగిన సింగిల్స్ క్లాస్ 4 మ్యాచ్‌లో 3-0తో అద్వితీయ విజయం సాధించింది.

దీంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భవీనాబెన్.. ఆ తర్వాత ప్రపంచ నంబర్ 2, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అయిన సెర్బియాకు చెందిన రాంకోవిక్‌తో జరిగిన పోరులోనూ ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. శుక్రవారం చైనాకు చెందిన మియావో జాంగ్‌‌తో జరిగిన సెమీఫైనల్‌లో 3-2తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఫలితంగా పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం ఖాయమైంది. రేపు ఉదయం 7.15 గంటలకు చైనాకు చెందిన ఝౌ యింగ్‌తో భవీనా ఫైనల్‌లో తలపడనుంది.

ఈ వార్త కూడా చదవండి: భారత్-ఇంగ్లండ్ సిరీస్‌కు రికార్డు వ్యూయర్ షిప్

Advertisement

తాజా వార్తలు

Advertisement