Monday, May 20, 2024

Delhi | ఢిల్లీ ఆంధ్రా స్కూల్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీలోని ఆంధ్రా ఎడ్యుకేషన్‌ సొసైటీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఐటీవోలో జరిగిన కార్యక్రమానికి ఏఈఎస్ ఉపాధ్యక్షులు ఎస్‌.ఎ. ఆలీషా హాజరయ్యారు. ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన లక్షలాది మంది స్వాతంత్ర్య పోరాట వీరులు, వీరనారుల త్యాగ ఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య ఫలాలని హర్షం వ్యక్తం చేశారు. గతేడాది 12వ తరగతిలో స్కూల్ టాపర్‌గా నిలిచిన ఆకాంక్ష తివారి ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఆమెకు నీలం యాదవ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement