Friday, May 3, 2024

విజయవాడ టు ఢిల్లీ విమాన సర్వీసులు పెంచండి : ఎంపీ జీవీఎల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విజయవాడ నుంచి ఢిల్లీ మధ్య విమానాల రాకపోకలు పెంచవలసినదిగా కేంద్ర ప్రభుత్వానికి, విమానయాన సంస్థలకు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ వంటి సంస్థలకు లేఖలు రాశారు. విజయవాడ నుంచి ఢిల్లీ మధ్య విమానాల సంఖ్య తగ్గించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని జీవీఎల్ పేర్కొన్నారు.

విమానాల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల డిమాండ్ పెరిగి టికెట్ల రేట్లు పెంచడంతో ప్రయాణికులపై భారం పడుతోందన్నారు. విమానాల రాకపోకలు పెంచడం ద్వారా ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని తొలగించవలసినదిగా ఎంపీ లేఖలో కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement