Thursday, April 25, 2024

Breaking: బేగంబ‌జార్‌లో మ‌ర్డ‌ర్‌.. ల‌వ్ మ్యారేజీ ఎఫెక్టేనా?

హైద‌రాబాద్‌లోని బేగంబజార్ లో దారుణం జ‌రిగింది. షాహీనాథ్ గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ వ్య‌క్తిని దారుణంగా చంపేశారు. ప్రేమ వివాహం చేసుకున్నారన్న క‌క్ష‌తోనే ఈ దాడి జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. బేగంబజార్ లోని మచ్చి మార్కెట్ సమీపంలోని ఆర్.ఎస్ ఎంటర్ ప్రైజెస్ ప్లాస్టిక్ షాప్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి చంపేశారు.

నలుగురు దుండగులు ఈ దాడిలో పాల్గొన్న‌ట్టు స‌మాచారం. ఏడాది క్రితం ప్రేమ పెళ్లి చేసున్నాడ‌ని, ఆ అమ్మాయి కుటుంబస‌భ్యులే క‌క్ష పెంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కాగా, రక్తం మడుగులో ఉన్న నీరజ్ పన్వార్ ను ఉస్మానియా ఆసుపత్రికి పోలీసులు త‌ర‌లించారు. దాదాపు 10 నుండి 20 క‌త్తి పోట్లు పొడిచినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు వేగ‌వంతం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement