Sunday, April 28, 2024

తెలంగాణలో కరోనా మృత్యువుగా మారిన వేళ – 53మంది కొత్తగా మృతి

తెలంగాణ లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 10,122 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఇంకా మ‌రో 5,474 మంది ఫ‌లితాలు రావాల్సి ఉంది. మరోవైపు క‌రోనా కార‌ణంగా గడిచిన 24 గంటల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు.

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 4.11 ల‌క్ష‌ల‌కుపైగా ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇందులో 3.40 ల‌క్ష‌ల మంది ఇప్పటికే కోలుకున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రవవ్యాప్తంగా 69,223 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 1440 మందికి పాజిటివ్ నిర్ధార‌ణ కాగా.. ఆ త‌ర్వాత మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 751 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement