Thursday, April 25, 2024

24 గంటల్లో 2251 కరోనా కొత్త కేసులు – తెలంగాణలో పెరిగిన తీవ్రత

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 2251 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి కారణంగా ఆరుగురు మృతి చెందారు. అదేవిధంగా 565 మంది ఈ మహమ్మారి బారినుండి కోలుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకు నమోదు అయిన కేసుల సంఖ్య 3,29,529కు చేరగా.. 3,05,900 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు కరోనాతో 1765 మంది ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 92.82 శాతంగా ఉందని.. అదే దేశవ్యాప్తంగా అయితే 89.9 శాతంగా ఉందని ఇక, యాక్టివ్ కేసులు 21,864గా ఉండగా.. అందులో హోం ఐసోలేషన్‌లోనే 14,431 మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement