Monday, May 6, 2024

టెస్టుల్లో టీమ్‌ఇండియా మళ్లీ నంబర్‌వన్‌..

ఐసీసీ టెస్టు టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెట్‌ జట్టు మళ్లీ అగ్రస్థానానికి దక్కించుకుంది. ఇవాళ ప్రకటించిన యాన్యువల్ అప్‌డేట్‌లో టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును పదిలం చేసుకుంది. న్యూజిలాండ్‌ 120 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య ఒక్క పాయింట్‌ మాత్రమే తేడా ఉంది. ఇంగ్లాండ్‌ వేదికగా జూన్‌లో ప్రపంచటెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియాపై 2-1తో టెస్టు సిరీస్‌ గెలిచిన భారత్‌..స్వదేశంలో ఇంగ్లాండ్‌పై 3-1తో సిరీస్‌ కైవసం చేసుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌(109 పాయింట్లు) టీమ్‌ ఆస్ట్రేలియా (108 పాయింట్లు)ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement