Thursday, May 9, 2024

భార్య మందు కొట్టిందని హత్య చేసిన భర్త

విశాఖ జిల్లా అరకు ప్రాంతంలో కలకలం రేగింది. భార్య మందు తాగిందన్న క్షణికావేశంలో భర్త దాడి చేయడంతో ఆమె దుర్మరణం పాలైంది. పోలీసుల వివరాల మేరకు.. పాచిపెంట మండలం మాముతూరు గ్రామంలో శోభన్, తులసి పామాయిల్ తోటలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం తన తల్లి రావడంతో తులసి ఆమెతో కలసి సాలూరుకు వెళ్లింది. తిరిగి సాయంత్రం వచ్చిన ఆమె ఫుల్లుగా మద్యం సేవించి ఉండటంతో శోభన్ ఆమెను మందలించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శోభన్, తన భార్యను ఇంటికి కాస్తంత దూరం తీసుకెళ్లి ఓ కర్రతో మొహంపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైన తులసి అక్కడికక్కడే మరణించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. శోభన్‌ను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement