Thursday, May 2, 2024

భార్య వేధింపులు తట్టుకోలేక పోలీస్‌స్టేషన్‌కే నిప్పుపేట్టిన భర్త..

ఈ మధ్య భార్యల వేధింపులు ఎక్కువయ్యాయి. సమాజం మారుతోంది. ఇదివరకటిలా కాకుండా ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. భార్యలను భర్తలు వేధించడం.. చిత్రహింసలు చేయడం మనకు కనిపించేవి.. అలాంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఈ మధ్య భార్యలే భర్తలను వేధింపులకు గురిచేస్తుండటం కూడా అడపదడప కనిపిస్తున్నాయి. తాజాగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఇలాంటి సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయి సంతోషంగా జీవితం మొదలయిన అతడికి భార్య వేధింపులు తీవ్రమయ్యాయి. వాటిని తాళలేక భర్త ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు నిప్పు పెట్టాడు. నిప్పంటించిన అనంతరం పారిపోకుండా అక్కడే నిలిచి ఉండడం విశేషం. కొద్దిసేపటికి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

గుజరాత్ లోని రాజ్‌కోట్‌ పట్టణంలోని జామ్‌నగర్‌ రోడ్డు రాజీవ్‌నగర్‌కు చెందిన దేవ్జీ చావ్డ (23)కు ఇటీవల వివాహమైంది. అప్పటి నుంచి భార్య వేధిస్తోంది. వాటిని తాళలేక ఆ యువకుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనను అరెస్ట్‌ చేయాలని పట్టుబట్టాడు. ఈ నేపథ్యంలోనే భజ్‌రంగ్‌ వాడి పోలీస్‌ ఔట్‌పోస్టుపై కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టాడు. వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని పోలీస్‌ అధికారి తెలిపారు. అనంతరం అక్కడే నిలబడి ‘నన్ను అరెస్ట్‌ చేయాలి’ అంటూ నిలబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిప్పును చల్లార్చి అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో అతడిని అరెస్ట్‌ చేసినట్లు గాంధీగ్రామ్‌ సీఐ కుమాన్‌సిన్హ్‌ తెలిపారు. ఈ సందర్భంగా అతడితో పాటు భార్యను కూడా కౌన్సిలెంగ్‌ చేయనున్నారు. వివాదానికి గల కారణాలు తెలుసుకుని వారి కాపురం చక్కబెట్టేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: ఆ దుర్మార్గున్ని అరెస్ట్ చేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement