Saturday, May 4, 2024

హిజాబ్ వ్యవహారం.. కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. కర్ణాటక ​ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ సుధాన్షు ధూలియా నేతృత్వంలోని బెంచ్‌ ఈ మేరకు.. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా స్టే కోరుతూ దాఖలైన పిటిషన్లకు స్పందించాలని సర్కార్‌ను కోరింది.

అదే సమయంలో పిటిషనర్లను సైతం ధర్మాసనం మందలించింది. ఈ పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని మీరే కోరారు. మళ్లీ వాయిదా అడిగారు. ఆపై మళ్లీ విచారణకు కోరారు. ఇప్పుడు మళ్లీ వాయిదా అడుగుతున్నారు. ఇలాంటి వాటికి ఇక్కడ అనుమతి లేదని… వాదనలు వింటామని పేర్కొంటూ సెప్టెంబర్‌ 5వ తేదీన వాదనలు ఉంటాయని స్పష్టం చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement