Thursday, April 25, 2024

వృద్దాశ్ర‌మంను ఎమ్మెల్యేతో క‌లిసి ప్రారంభించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్, చైతన్యపురిలోని ఎల్వీఎస్ రెసిడెన్సీ హౌస్ దగ్గర పెనుగొండ వాసవి మాత పాదుకలకు పూజలు నిర్వహించి అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్వీ సేవా వేదిక వారి వృద్ధుల ఆశ్రమంను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తో కలిసి రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎల్వీ కుమార్ శైలజ, ఎల్ రాహుల్, ఎల్ శుశ్రుత, ఎల్వీ సాత్విక్, ఎల్ శ్రీనివాస్ సునీత, స్థానిక కార్పొరేటర్ నర్సింహ్మ గుప్తా, చింతల బాలరాజ్, ఉర నర్సింహ్మ గుప్తా, కుంచకూరి కిషన్, ఎఆర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement