Thursday, March 28, 2024

టీఆర్‌ఎస్‌ పెద్దపల్లి జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గౌరెడ్డిపేటలోని టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ఘ‌న‌ స్వాగతం పలికారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా జిల్లా స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా గౌరెడ్డిపేట శివారులో ఎకరం విస్తీర్ణంలో మీటింగ్‌ హాల్‌, పార్టీ కార్యాలయం, శిక్షణ హాల్‌, సెక్యూరిటీ గదిని నిర్మించారు. దాదాపుగా 2 వేల మందితో సభలు, సమావేశాలు నిర్వహించుకునే విధంగా కార్యాలయాన్ని నిర్మించారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
కలెక్టరేట్‌ ప్రధాన ద్వారంతో పాటుగా భవనంలోని అన్ని కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంబించారు. ప్ర‌త్యేక‌ పూజ కార్యక్రమం అనంతరం సముదాయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేష్ నేత, విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పటు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement