Tuesday, May 7, 2024

పొంగులేటికి హైకోర్టులో ఊర‌ట – భూముల స‌ర్వేపై స్టేట‌స్ కో….

హైదరాబాద్ – భూముల స‌ర్వేపై హైకోర్టును ఆశ్ర‌యించిన టీకాంగ్రెస్ ప్రచార కమిటీ కోఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది.. కాగా, ఆయ‌న భూములలో క‌బ్టా భూమి ఉందంటూ ప్రభుత్వం చేస్తున్న సర్వేను సవాల్ చేస్తూ హైకోర్టును ఆయ‌న ఆశ్రయించారు.ఈ పిటిషన్ ను ఈరోజు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సర్వేపై స్టేటస్ కో ఆర్డర్ జారీ చేసింది. సర్వే చేసి రిపోర్టును హైకోర్టుకు సమర్పించాలని అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్ట్ 1కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement