Friday, May 24, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హైఅలర్ట్


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు. అగ్నిపథ్‌కు నిరసనగా పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్థులు ఈరోజు భారత్ బంద్‌ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. జూన్ 17న జరిగిన ఘటనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భద్రతా బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రజాసంఘాలు, అభ్యర్థులు ఎవరూ రైల్వే స్టేషన్ వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement