Friday, May 3, 2024

వ్యాపార‌వేత్త‌ల‌పై కేసు పెట్టిన‌ న‌టి స్నేహ ..ఎందుకో తెలుసా..

ఇద్ద‌రు వ్యాపార వేత్త‌ల‌పై కేసు ఫైల్ చేసింది సీనియ‌ర్ న‌టి స్నేహ‌. స‌ద‌రు వ్యాపార వేత్త‌లిద్ద‌రూ ఎక్స్ పోర్ట్ కంపెనీని నిర్వ‌హిస్తున్నారు. వారి కంపెనీలో స్నేహ కూడా మ‌నీని ఇన్వెస్ట్ చేశార‌ట‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో వారిపై చెన్నైలోని కాన‌త్తూర్ పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టారామె. అయితే స్నేహ 26 లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేయగా.. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఆమెకు రిటర్న్ చేయలేదట. దీంతో ఆమె తన డబ్బుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని డిమాండ్ చేయగా.. వారు బెదిరింపులకు పాల్పడ్డారని స్నేహ తన ఫిర్యాదులో పేర్కొంది. స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement