Monday, April 29, 2024

వైర‌ల్ గా హీరోయిన్ ప్ర‌ణీత – సీమంతం ఫొటోలు

తెలుగులో ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ పక్కన న‌టించింది హీరోయిన్ ప్రణీత . త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. అలాగే ఎన్టీఆర్ కి జంటగా రామయ్యా వస్తావయ్యా చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకోలేకపోయిన ప్రణీత అడపాదడపా చిత్రాలు చేశారు. కాగా ప్ర‌స్తుతం హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రెగ్నెంట్ అన్న సంగ‌తి తెలిసిందే.. సాంప్రదాయం ప్రకారం సీమంతం వేడుకని జ‌రిపారు. కుటుంబ సభ్యులు, బంధువులు సమక్షంలో ఘనంగా ఈ వేడుక జరిగింది. పసుపు పచ్చ పట్టు చీరలో ప్రణీత నిండుగా తయారయ్యారు. తన సీమంత వేడుక ఫోటోలు ప్రణీత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇక అభిమానులతో పాటు పరిశ్రమ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఆమెకు పండంటి బిడ్డ పుట్టాలని ఆశీర్వదిస్తున్నారు. గతేడాది మే30న వ్యాపార వేత్త నితిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. కరోనా కారణంగా తన వివాహానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇవ్వకుండా ఈ జంట ఒక్కటైంది. ఆ తర్వాత అభిమానులకు వివరణ ఇస్తూ.. కరోనా నేపథ్యంలో డేట్ విషయంలో కన్ష్యూషన్ ఉండటంతో రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని తెలియజేశారు. కాగా, నితిన్, సుభాష్ బెంగళూరులో వివాహాం చేసుకుని ఇఫ్పటికీ ఏడాది కూడా పూర్తి కాలేదు. ఈ లోపే ప్రణీత తన అభిమానులు శుభవార్త చెప్పింది. త్వరలో తను తల్లి కాబోతున్నట్టు తెలియజేసింది. ఈ మేరకు తన భర్తతో కూడిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ప్రస్తుతం ఆమె హిందీలో చిత్రాలు చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement