Wednesday, May 15, 2024

హీరో విశాల్ కి తీవ్ర గాయాలు-ఆసుప‌త్రికి త‌ర‌లింపు

త‌మిళ హీరో విశాల్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.కాగా విశాల్ మరోసారి గాయపడినట్లు సమాచారం అందుతోంది. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement