Thursday, May 2, 2024

జాతీయ స‌మైక్య‌త‌ను చాటుతూ ఫ్రీడ‌మ్ ర‌న్ .. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

75 ఏళ్ల వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా జాతీయ సమైక్యతను చాటుతూ ఫ్రీడ‌మ్ ర‌న్ నిర్వ‌హిస్తున్న‌ట్లు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సరూర్ నగర్ స్టేడియంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యార్థులు….. యువకులు భారీ సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…. విదేశీ బానిస సంకెళ్లు తెంచుకొని యావత్ భారతవణి స్వేచ్ఛ వాయువులు పిలుస్తూ 75 ఏళ్ళు గడుస్తున్న శుభ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా 15 రోజుల సంబరాలు, దేశ భక్తి పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశించారన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రోజు వారీగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉవ్వెత్తున కొనసాగుతున్నాయని, పల్లె పల్లెన, పట్టణాల్లో ఫ్రీడమ్ రన్ విజయ‌వంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఒక్కరిలో స్వాతంత్ర్య స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరిస్తూ వజ్రోత్సవాల వేళ పరుగు పెడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రభుత్వ పథకాలు పేదల దరికి చేరినప్పుడే స్వాతంత్ర్య ఫలాలు అందినట్లు అని భావిస్తూ రాష్ట్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ రాష్ట్ర ప్రజల చిరునవ్వుకు కారణమ‌వుతున్నారన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో మహాత్మ గాంధీజీ చేసిన పోరును రానున్న తరాలు గుర్తు పెట్టుకునేలా గాంధీజీ చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా చూపిస్తున్నామన్నారు. ప్రజలందరికీ ముందస్తుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మూసి రివర్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు దయనంద్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ అమోయ్ కుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement