Friday, May 3, 2024

నేటితో కేజీఎఫ్2కి ఏడాది.. పార్ట్‌-3పై అప్ డేట్

క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌కి గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రం కేజీఎఫ్.కాగా కేజీఎఫ్‌ విడుదలై సంచలనాలు సృష్టించింది. ఇండియా మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా ఉంది. ఇక సెకండ్‌ పార్ట్‌తో దేశం మొత్తం ఊగిపోయింది. బాక్సాఫీస్‌ దగ్గర ఊచకోత అంటే ఏంటో నిరూపించింది. గతేడాది ఇదే రోజున భారీ అంచనాలతో విడుదలైన కేజీఎఫ్‌. అంతే భారీ స్థాయిలో ఓపెనింగ్స్‌ తీసుకువచ్చింది. ఒక్క కన్నడనే కాదు రిలీజైన ప్రతిభాషలోనూ కోట్లు కొల్లగొట్టింది. ఇండియన్‌ బాక్సాఫీస్‌ దగ్గర వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్‌లు రాబట్టి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అక్కడి సినిమాలను సైతం వెనక్కినెట్టి విజయకేతనం ఎగురవేసింది. హీరోగా యశ్.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. రావుర‌మేష్, ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్‌రాజ్‌ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ర‌వి బ‌స్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిరగందూర్ నిర్మించారు.

కేజీఎఫ్2 చిత్రం 14 April 2022న రిలీజ్ అయింది. కాగా ఈ చిత్రం శుక్రవారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో చిత్రబృందం కేజీఎఫ్‌ సెకండ్‌ పార్ట్‌కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. అందులోనే పార్ట్‌-3కి సంబంధించిన హింట్‌ను ఇచ్చింది. అమ్మకిచ్చిన వాగ్దానం నెరవేరుతుంది. నిజంగా నెరవేరిందా అంటూ వీడియోలో పార్ట్‌-3 ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆ వీడియోకు హోంబలే ఫిల్మ్‌ సంస్థ ఓ నోట్‌ను జతచేసింది. మరుపురాణి క్యారెక్టర్‌లు, యాక్షన్‌తో కేజీఎఫ్‌-2 ప్రయాణం అద్భుతంగా సాగింది. గ్లోబల్‌ రికార్డులతో పాటు అనేక హృదయాలను గెలుచుకుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్‌తో సలార్‌ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండింటి తర్వాతే పార్ట్‌-3 పట్టాలెక్కే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement