హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో మరోసారి భారీగా హవాలా నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్ లో సుమారు రూ.2.5 కోట్ల హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నగదును అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, రెండు రోజుల వ్యవధిలో మొత్తం రూ.4 కోట్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగదుకు సంబంధించి నిందితుల వద్ద ఎలాంటి ఆధారాలు, రసీదులు లేకపోవడంతో హవాలా మార్గం ద్వారా తరలిస్తున్న సొమ్ముగా గుర్తించారు. ఇంత భారీగా నగదును ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement