Thursday, May 16, 2024

రేపటి నుంచి విద్యా సంస్థలు షురూ…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రేపటి నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. దసరా సెలవులు ముగియడంతో రేప‌టినుంచి (సోమ‌వారం) విద్యా సంస్థలన్నీ పున:ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలకు ప్రభుత్వం దసరా సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ 26 నుంచి ఈనెల 9వ తేదీ వరకు పాఠశాలలకు ఇచ్చారు. జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 2 నుంచి 9వ తేదీ వరకు ప్రకటించారు. అయితే ఈ సెలవులు ఇక ముగియడంతో 10వ తేదీ (రేపటి) నుంచి విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. మొన్నటి వరకు సెలవులు ఉండడంతో చాలా మంది విద్యార్థులు తమ సొంతూళ్లకు వెళ్లారు. మళ్లి పున:ప్రారంభం కానుండడంతో ఇక విద్యార్థులందరూ చదువుబాట పట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement