Saturday, May 18, 2024

ఫుడ్డీస్ కి గున్ న్యూసే…. కొత్త‌గా ప‌రాఠా పిజ్జా ప్రారంభించిన డొమినోస్..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : భారతదేశంలోని అతిపెద్ద పిజ్జా చైన్‌ వినూత్నమైన డొమినోస్‌ పిజ్జా తాజా ఆఫర్‌లో భాగంగా పరాఠా పిజ్జాను ప్రారంభించింది. బ్రాండ్‌ ఆవిష్కరణలు, రుచికరమైన ఉత్పత్తుల వలన వినియోగదారులు దాన్ని ఎక్కువగా ఇష్టపడతారని సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ సందీప్‌ ఆనంద్‌ అన్నారు. పరాఠా, పిజ్జా అద్భుతమైన కలయికను తీసుకురావడం ద్వారా మెనులో భారతీయీకరణను పునర్నిర్వచించిందని, ఇది వినియోగదారులకు రెండు వెరైటీ ప్రపంచాల్లో ఉత్తమమైన వాటిని అందిస్తుందన్నారు.

కొత్త పరాఠా పిజ్జా శ్రేణిని ప్రారంభించడంతో, డొమినోస్‌ అత్యంత ఇష్టపడే రెండు వంటకాలను, పరాఠా గొప్ప రుచి పిజ్జా చీజ్‌నెస్‌ను ఒకచోట చేర్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బ్రాండ్‌ కొత్త మెనూ ఆఫరింగ్‌లతో అన్ని వయసుల వారి అభిరుచికి అనుగుణంగా స్థిరమైన నిబద్ధతతో ఎమర్జింగ్‌ కన్స్యూమర్‌ ట్రెండ్‌లతో కనెక్ట్‌ అవుతూనే ఉందన్నారు. తమ వినియోగదారులను, వారి అభివృద్ధి చెందుతున్న ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడంపై దృష్టి పెడతామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement