Sunday, May 19, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌.. మొక్క‌లు నాటిన జోగిని శ్యామ‌ల‌

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ ఎంసీ పార్క్ లో జోగిని శ్యామల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్యామల మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement