Tuesday, May 7, 2024

బాక్సింగ్‌లో గోవింద్‌, దీపక్‌ గెలుపు

ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. గురువారం నాటి పోరులో భారత ప్లేయర్లు గోవింద్‌ సహాని, దీపక్‌ కుమార్‌ విజయం సాధించారు. తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. 2022 థాయిలాండ్‌ ఓపెన్‌ చాంపియన్‌ అయిన సహాని తజకిస్తాన్‌కు చెందిన మెహ్రాన్‌ షఫీవ్‌పై 5-0తో అద్భుత విజయం సొంతం చేసుకున్నారు.

పురుషుల 48 కేజీల బౌట్‌లో ప్రిలిమినరీ రౌండ్‌ దాటేశాడు. రెడ్‌కార్నర్‌ వైపునుంచి ఆడిన సహాని, పూర్తి ఆధిపత్యాన్ని చాటాడు. మరోవైపు దీపక్‌ కుమార్‌ కూడా ఇదే తరహాలో రాణించాడు. 2019 ఆసియా సిల్వర్‌ మెడలిస్టు అయిన కుమార్‌, ఈక్వెడార్‌ బాక్సర్‌ లూయిస్‌ డెల్గడోపై 5-0తో నెగ్గాడు. 51 కేజీల విభాగంలో ఇతను భారత్‌కు విజయాన్ని అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement