Sunday, May 19, 2024

ఢిల్లీలో గవర్నర్ తమిళిసై.. నూతన ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఢిల్లీ పర్యటన చేపట్టారు. ఉదయం 9 గంటలకు ఢిల్లీ చేరుకున్న ఆమె మొదట తెలంగాణ భవన్‌లోని శబరి కాటేజ్‌కు చేరుకున్నారు. 11 గంటలకు నారీశక్తి కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. అనంతరం ఇటీవల కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కర్‌ను కలిశారు. ఆయనకు పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని రాత్రి 9 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement