Friday, May 3, 2024

పవన్ కళ్యాణ్ ఎంతో స్ఫూర్తిదాయకం: గవర్నర్‌ తమిళి సై

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను తెలంగాణ గవర్నర్‌ తమిళి సై అభినందించారు. కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య ఈ మధ్య ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. బీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పాడినప్పటి నుంచి మొగులయ్య పేరు సోషల్ మీడియాలో నానుతోంది. ఇక తాజాగా మొగులయ్యను ను పవన్ అభినందిచిన విషయం తెలిసిందే. మొగులయ్య కు పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందచేశాడు. తాజాగా దీనిపై స్పందించారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. కళాకారుడి కి పవన్‌ కళ్యాణ్‌ సాయం అందించడం ఎంతో స్ఫూర్తికరమన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. పేద కళాకారులను ఆర్థికంగా ఆదుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్‌ను అభినందిస్తూ ట్వీట్‌ చేశారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై. కాగా… కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్య కు నిన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి: అడ్డమైన కారణాలతో పెన్షన్లు తొలగిస్తున్నారు: లోకేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement