Friday, March 29, 2024

అడ్డమైన కారణాలతో పెన్షన్లు తొలగిస్తున్నారు: లోకేష్

రాష్ట్రంలో పెన్షన్లు పెంచుకుంటూ పోతానన్న జగన్.. తుంచుకుంటూ పోతున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రూ.3 వేల పెన్షన్ ఇస్తానని జగన్‌రెడ్డి మాట మార్చి మడమ తప్పారని దుయ్యబట్టారు. అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు తొలగిస్తున్నారన్నారు. 65 లక్షల మందికి పెన్షన్ ఇస్తానని డాబు కబుర్లు చెప్పి అడ్డమైన కారణాలు చెబుతూ భారీగా పెన్షన్లు కోతపెడుతున్నారని మండిపడ్డారు. గత 2 నెలల్లోనే 2.30 లక్షల పెన్షన్లు కోతపెట్టారన్నారు. వైసీపీ పెడుతున్న మానసిక క్షోభ భరించలేక.. పెన్షనే ఆధారంగా బతుకుతున్న 13 మంది వృద్ధులు మృతి చెందారని నారా లోకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అవ్వా తాత దగ్గర నెలకు రూ.500 కొట్టేస్తున్నదేగాక.. భారీగా పెన్షన్లు కోసేస్తున్న పాపం ఊరికే పోదన్నారు. ఎత్తేసిన పెన్షన్లు తక్షణమే ఇవ్వాలని నారా లోకేష్‌ డిమాడ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement